సూర్య గ్రహణ కాలంలో అర్ఘ్యం, పూజ నిషేధమా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Solar Eclipse Naivedyam: హిందూ నమ్మకాల ప్రకారం.. ప్రతిరోజూ సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల జీవితం లోని ప్రతికూల శక్తులు తొలగి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అయితే సూర్యగ్రహణం సమయంలో సూర్యుడికి ప్రార్థనలు చేయవచ్చా? నైవేద్యం ఇవ్వవచ్చా..? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయంపై శాస్త్రాలు, జ్యోతిష్యం ఏమి చెబుతున్నాయో పరిశీలిద్దాం.

సూర్య గ్రహణ కాలంలో అర్ఘ్యం, పూజ నిషేధమా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Solar Eclipse

Updated on: Feb 14, 2026 | 2:44 PM

భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో సూర్య, చంద్ర గ్రహణాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. గ్రహణ సమయాల్లో కొన్ని నియమాలు, ఆచారాలు తప్పనిసరిగా పాటించాలనే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా సూతక కాలం, ఆహార నియమాలు, శుద్ధీకరణ కర్మలు వంటి అంశాలపై విశేష శ్రద్ధ వహిస్తారు. సాధారణ రోజుల్లో భక్తులు సూర్య దేవుడికి నీటి(అర్ఘ్యం)ని అర్పిస్తూ ఆశీర్వాదాలు కోరుతారు. నమ్మకాల ప్రకారం.. ప్రతిరోజూ సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల జీవితం లోని ప్రతికూల శక్తులు తొలగి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అయితే సూర్యగ్రహణం సమయంలో సూర్యుడికి ప్రార్థనలు చేయవచ్చా? నైవేద్యం ఇవ్వవచ్చా..? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయంపై శాస్త్రాలు, జ్యోతిష్యం ఏమి చెబుతున్నాయో పరిశీలిద్దాం.

గ్రహణ సమయంలో సూర్యార్చన చేయవచ్చా..?

వేదకాలం నుంచే ఉదయం సూర్యుడికి రాగి పాత్రలో నీటిని అర్పించడం దినచర్యలో భాగంగా కొనసాగుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది జాతకంలో సూర్య గ్రహాన్ని బలపరుస్తుందని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. కానీ, సూర్యగ్రహణం సమయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ధార్మిక నియమాల ప్రకారం.. ఈ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం నివారించాలి అని చెప్పబడింది. గ్రహణ సమయంలో రాహు, కేతు ప్రభావం పెరుగుతుందని, ఇది సూర్యుని శుభశక్తిని క్షీణింపజేస్తుందని నమ్మకం.

పూజలు చేయకూడదా..?

అలాగే గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం కళ్లకు హానికరమని శాస్త్రీయంగా కూడా సూచించబడింది. అందువల్ల ఆ సమయంలో అర్ఘ్యం సమర్పించడం, సూర్యుని దర్శనం చేయడం మంచిది కాదని భావిస్తారు. గ్రహణానికి ముందు ఉండే సూతక కాలంలో కూడా పూజలు చేయకూడదని సంప్రదాయం చెబుతుంది.

2026 సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం

సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్య రోజునే సంభవిస్తుంది. 2026 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న, మాఘ మాస అమావాస్య రోజున సంభవించనుంది. ఇది కంకణాకార (రింగ్ ఆఫ్ ఫైర్) సూర్యగ్రహణంగా ఉంటుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం సుమారు 3:26 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7:57 గంటలకు ముగుస్తుంది. ఇది కుంభ రాశిలో సంభవిస్తుంది.

గ్రహణం మనదేశంలో కనిపించదు కాబట్టి..

అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో దీనికి సూతక కాలం వర్తించదు. ఇలా సనాతన సంప్రదాయం ప్రకారం, సూర్యగ్రహణ సమయంలో ప్రత్యేక నియమాలు పాటించాలి. సాధారణ రోజుల్లో సూర్యారాధన శుభప్రదమైనదే అయినప్పటికీ, గ్రహణ సమయాల్లో మాత్రం శాస్త్రోక్త నియమాలను అనుసరించడం శ్రేయస్కరం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)