Astrology Tips: భోజ‌నం చేయడం ఒక్కటే కాదు.. ఎలా తింటున్నారో కూడా ముఖ్యం..

|

Nov 08, 2022 | 1:51 PM

మ‌న శ‌రీరానికి ఆహారం ఎంతో అవ‌స‌రం..? ఎంత తింటున్నాం..? ఎలా భోజనం చేయాలి..? భోజనం చేస్తున్నప్పడు ఎం చేయాలో కూడా మన సనాతన ధర్మంలో చెప్పబడింది. అయితే ఎలా భోజనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Astrology Tips: భోజ‌నం చేయడం ఒక్కటే కాదు.. ఎలా తింటున్నారో కూడా ముఖ్యం..
Bhojanam
Follow us on

భోజనం ప్రతి మనిషికీ ఒక ప్రాథమిక అవసరం. ఇది మనం నిర్ధిష్టమైన సమయంలో తీసుకునే ఆహారం. సాధారణంగా భోజనం మధ్యాహ్నం, రాత్రి సమయాలలో తీసుకుంటారు. అయితే జీవన జీవనానికి సంబంధించిన అనేక నియమాలు, సంప్రదాయాలు సనాతన ధర్మంలో చెప్పబడ్డాయి. శతాబ్దాలు గడిచినా కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ నియమాలు, సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఇంత కాలం గడిచినా ఈ నిబంధనలు తమ ఔచిత్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకు మార్గదర్శకంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ రోజు మనం ఆహారానికి సంబంధించిన 5 నియమాల గురించి తెలుసుకుందాం. ఆహారానికి సంబంధించిన ఈ నియమాలను పాటించినవారు ఆరోగ్యంతో జీవిస్తారు.

అదే విధంగా భోజ‌నం తినేట‌ప్పుడు క‌డుపు నిండుగా భుజించ‌కూడ‌దు. ఎంత రుచిగా ఉన్నా కూడా మ‌న‌ం ఎంతవరకు సరిపోతుందో అంతే ఆహారాన్ని మాత్ర‌మే తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క‌డుపులో పావు వంతు భాగాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి. స‌హ‌జంగా చాలా మంది ఆక‌లివేసిన‌ప్పుడు నీళ్లు ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. అలా చేయ‌డం ఆరోగ్యానికి అస్సులు మంచిది కాదు. భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్లు తాగాల‌నిపిస్తే కొద్ది మోతాదులో నీటిని మాత్ర‌మే తాగాలి. భోజ‌నానికి అర గంట ముందు అలాగే భోజ‌నం త‌రువాత అర‌గంట వ‌ర‌కు నీటిని తాగ‌కూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకేసారి 3 రోటీలు తీసుకోకండి

సనాతన ధర్మంలో ఏదైనా శుభ కార్యంలో సంఖ్య 3 అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఆహారం తినడం కూడా అలాంటి శుభ కార్యమే అని అంటారు. అందువల్ల, మీరు ఎవరికైనా ఆహారం వడ్డిస్తున్నప్పడు వారికి ఒకేసారి 3 రోటీలు వడ్డించకండి. కానీ వారికి 2 లేదా 4 రోటీలు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఆ ఆహారం శరీరానికి అందుతుంది. ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. దీనివల్ల వైద్యుని ఖర్చులు ఆదా అవుతాయి.

మీ చేతులను ఎప్పుడూ ఆహారం ప్లేట్‌లో కడుక్కోవద్దు

ఆహారం తీసుకున్న తర్వాత ప్లేట్‌లో చేతులు కడుక్కోకూడదు. ఇది మర్యాదలకు విరుద్ధంగా పరిగణించబడుతుంది. అలా చేస్తే మీరు చేతులు కడిగిన నీరు పక్కన ఉండేవారి ప్లేట్‌లో పడే అవకాశం ఉంది.

భోజనం చేసే ముందు ఈ మంత్రాన్ని జపించండి

మీరు ఆహారం తినడం ప్రారంభించే ముందు భోజన మంత్రాన్ని చెప్పండి. ఇలా చేయడం వల్ల ఆ ఆహారం మన శరీరంలోకి చేరి మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి, మీరు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడల్లా, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం మర్చిపోవద్దు. ఎవరి ఆశీర్వాదం వల్ల మీరు మీ జీవితాన్ని గడపడానికి శుభం జరుగుతుంది.

ఫుడ్ ప్లేట్‌లో ఆహారాన్ని వదలకూడదు

సనాతన ధర్మంలో ఆహారాన్ని వృధా చేయడం తప్పు అని చెప్పారు. మనం ఎంత తింటామో అంతే భోజనంను వడ్డించుకోండి. అవసరానికి మించి ఆహారం పెట్టుకోవడం.. ఆ తర్వాత తినకపోవడం వల్ల అది పాడైపోతుంది. అంతే కాదు భోజనం వృదా చేయడం మహా పాపం అని చెప్పవచ్చు.

నేలపై కూర్చొని ఆహారం తినండి

కొంద‌రు నిల‌బ‌డి భోజ‌నం చేస్తూ ఉంటారు. నిల‌బ‌డి భోజ‌నం చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డంతో పాటు అసిడిటీ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. నేలపై కూర్చొని భోజనం చేయాలని గ్రంధాలలో చెప్పబడింది. ఇలా చేయడం ద్వారా భూమి సానుకూల తరంగాలు పాదాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. శరీరం ఆరోగ్యంగా, సానుకూల శక్తిని ఇస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.  నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం