రైల్వే ప్రయాణికులకు గమనిక… ఈ స్టేషన్లలో మాత్రమే ఆగదు
రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో నేటి నుంచి కొన్ని రైల్వేస్టేషన్లలో హాల్టలను రైల్వేశాఖ నిలిపివేసింది. కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం కొన్ని స్టేషన్లలో స్టాప్లు నిలిపివేసినట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
దాదాపు రెండు నెలల తర్వాత జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రైల్వేస్టేషన్లు కళకళలాడుతున్నాయి. గత నాలుగు రోజులుగా..ఏపీలో 22 ట్రైన్లు నడుస్తున్నాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సూచన చేసింది. రైలు సర్వీసుల కోసం ప్రస్తుతం ఉన్న కొన్ని స్టాప్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో నేటి నుంచి కొన్ని రైల్వేస్టేషన్లలో హాల్టలను రైల్వేశాఖ నిలిపివేసింది. కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం కొన్ని స్టేషన్లలో స్టాప్లు నిలిపివేసినట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
రైళ్లు ఆగని స్టేషన్ల వివరాలు ఇవి :
1. సికింద్రాబాద్- ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02703/02704) : పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట, పలాస, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగదు.
2. సికింద్రాబాద్-గుంటూరు(గోల్కొండ ఎక్స్ప్రెస్) : కొండపల్లి, రాయనపాడు, కృష్ణాకెనాల్, మంగళగిరి, నంబూరు, పెదకాకానిలో ఆగదు.
3. హైదరాబాద్-విశాఖ(గోదావరి ఎక్స్ప్రెస్)(ట్రైన్ నెంబర్ 02728/02727) : తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి, దువ్వాడ స్టేషన్లలో ఆగదు.
4. తిరుపతి-నిజామాబాద్(రాయలసీమ ఎక్స్ప్రెస్) (ట్రైన్ నెంబర్ 02793/02794) : రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గూటి స్టేషన్లలో ఆగదు.
5. ముంబై-భువనేశ్వర్(కోణార్క్ ఎక్స్ప్రెస్) (ట్రైన్ నెంబర్ 01019/01020) : తాడేపల్లిగూడెం, నిడదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగదు.
6. ముంబై-బెంగళూరు(ఉద్యాన్ ఎక్స్ప్రెస్) ట్రైన్ నెంబర్01031 /01032): ఆదోని, గూటి, ధర్మవరం, ప్రశాంతి నిలయం, పెనుకొండ, హిందూపురంలో ఆగదు.
ఈ క్రింది స్టేషన్లలో రైళ్లు ఆగుతాయి:
7. విశాఖపట్నం-న్యూఢిల్లీ(ఏపీ ఎక్స్ప్రెస్) (ట్రైన్ నెంబర్02805/02806) : రాజమండ్రి, ఏలూరు, బెజవాడలో ఆగనుంది.
8. యశ్వంత్పూర్-హౌరా(దురంతో ఎక్స్ప్రెస్): విజయవాడ, రేణిగుంటలో ఆగనుంది. విజయనగరంలో ఆగదు.
9. బెంగళూరు-నిజాముద్దీన్(రాజధాని): గుంతకల్, అనంతపురం స్టేషన్లలో ఆగనుంది.
10. నిజాముద్దీన్-చెన్నై (బై వీక్లీ) (ట్రైన్ నెంబర్ 02434 /024333): విజయవాడలో ఆగుతుంది.
— SouthEasternRailway (@serailwaykol) June 3, 2020
Cancellation of Tickets Due to Reduction in Train Stoppages pic.twitter.com/FnSAGd7djX
— SouthCentralRailway (@SCRailwayIndia) June 3, 2020
Cancellation of Tickets Due to Reduction in Train Stoppages pic.twitter.com/JJLZmWXMsz
— SouthCentralRailway (@SCRailwayIndia) June 3, 2020