థాయ్లాండ్ ఓపెన్కు సిద్ధమవుతున్న పీవీ సింధు, సైనా నెహ్వాల్.. దాదాపు పది నెలల తర్వాత బరిలోకి..
Thailand Open: కరోనా వల్ల దాదాపు పది నెలల పాటు అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉన్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇప్పడు
Thailand Open: కరోనా వల్ల దాదాపు పది నెలల పాటు అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉన్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇప్పడు థాయ్లాండ్ ఓపెన్ పోరుకు సిద్దమవుతున్నారు. టోక్యో ఒలింపిక్స్కు ముందు అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ రాకెట్ సత్తా చూపనున్నారు. ఈ పోటీలో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్ గెలిచేందుకు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.
లండన్లో ప్రత్యేక శిక్షణ పొందిన సింధు ఆరో సీడ్గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్కు చెందిన మియా బ్లిచ్ఫెల్డ్తో తలపడనుంది. ప్రపంచ 20వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో కిసొనా సెల్వడురే (మలేసియా)తో పోటీ పడుతుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్ల్లో 14 ర్యాంకర్ శ్రీకాంత్ భారత్కే చెందిన సౌరభ్ వర్మతో, వంగ్చరొన్ (థాయ్లాండ్) తో సాయిప్రణీత్, లీ జి జియా (మలేసియా)తో ప్రణయ్, జాసన్ అంథోని (కెనడా)తో కశ్యప్ ఆడతారు. అయితే కరోనా వల్ల ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరకడంతో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. దీంతో పోటీలు రసవత్తరంగా జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉన్నా.. ఆట మానేదే లేదు.. స్పష్టం చేసిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్
లాక్ డౌన్ కారణంగా ఆటకుదూరమై.. తిరిగి బరిలో దిగనున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్