టీడీపీలోకి గౌరు దంపతుల చేరికకు ముహూర్తం ఖరారు

| Edited By: Srinu

Mar 07, 2019 | 3:57 PM

టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డి దంపతులు అందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వారు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని, 9వ తేదిన కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా గౌరు దంపతులు కోరారు. అలాగే నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని గౌరు […]

టీడీపీలోకి గౌరు దంపతుల చేరికకు ముహూర్తం ఖరారు
Follow us on

టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డి దంపతులు అందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వారు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని, 9వ తేదిన కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా గౌరు దంపతులు కోరారు. అలాగే నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని గౌరు దంపతులు అన్నారు.