స్టీల్‌ ప్లాంట్‌ కోసం కార్మిక సంఘాల ‘ఉక్కు’పిడికిలితో ఉద్యమ కార్యాచరణ.. రేపటి నుంచి అమలు చేసే కార్యక్రమాలు ఇవే..

విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు అఖిలపక్ష పార్టీలు ఎవరి ప్రయత్నల్లో..

స్టీల్‌ ప్లాంట్‌ కోసం కార్మిక సంఘాల ఉక్కుపిడికిలితో ఉద్యమ కార్యాచరణ.. రేపటి నుంచి అమలు చేసే కార్యక్రమాలు ఇవే..

Updated on: Feb 11, 2021 | 3:29 PM

విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు అఖిలపక్ష పార్టీలు ఎవరి ప్రయత్నల్లో వాళ్లు ఉన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాలు ఏర్పాడ్డారు. ఇవాళ సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు. రేపు ఉదయం 8గంటలకు కూర్మన్నపాలెం జంక్షన్‌ వద్ద రిలే దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. 18న ఉక్కు పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని… పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోనున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఉక్కు పరిరక్షణ కమిటీ నిర్వహించింది.

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బీసీ గేట్ దగ్గర జనసేన ఆందోళన చేపట్టింది. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమావేశమైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో జనసేన స్వరం పెంచింది. ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటోంది. పాత గాజువాక జంక్షన్‌లో సీఐటీయూ రాస్తారోకో చేపట్టింది.

మరోవైపు విశాఖ ఉక్కు రెండు లక్షల కోట్ల స్కామ్‌ అంటూ ఆరోపిస్తున్నారు ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ శైలజానాథ్‌. స్కామ్‌లో బీజేపీ, వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పోరాటాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామన్నారు శైలజానాథ్‌.

 

Read more:

రెండు తెలుగు రాష్ట్రాల్లో మోగిన మరో ఎన్నికల నగారా.. షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Loading...
Unable to load recommendations.
Follow Us