స్ట్రెచర్‌పై పడుకొని ఎన్నికల ప్రచారం

| Edited By:

Apr 08, 2019 | 9:00 AM

ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. మరోవైపు గాయం వేధిస్తోంది. అయినా ఆ అభ్యర్థి వెనుకడుగు వేయలేదు. స్ట్రెచర్‌పై పడుకొని ప్రచారం చేస్తున్నారు. కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పాలకుర్తి తిక్కారెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఇటీవల మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామానికి వెళ్లిన తిక్కారెడ్డికి.. అక్కడ జరిగిన ఘర్షణలో కాలికి బుల్లెట్ తగిలింది. దీంతో చికిత్స చేయించుకొని స్ట్రెచర్‌పై వచ్చి నామినేషన్ వేసిన ఆయన.. దానిపైనే ప్రచారం చేస్తున్నారు. ఆయన […]

స్ట్రెచర్‌పై పడుకొని ఎన్నికల ప్రచారం
Follow us on

ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. మరోవైపు గాయం వేధిస్తోంది. అయినా ఆ అభ్యర్థి వెనుకడుగు వేయలేదు. స్ట్రెచర్‌పై పడుకొని ప్రచారం చేస్తున్నారు. కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పాలకుర్తి తిక్కారెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే.

ప్రచారంలో భాగంగా ఇటీవల మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామానికి వెళ్లిన తిక్కారెడ్డికి.. అక్కడ జరిగిన ఘర్షణలో కాలికి బుల్లెట్ తగిలింది. దీంతో చికిత్స చేయించుకొని స్ట్రెచర్‌పై వచ్చి నామినేషన్ వేసిన ఆయన.. దానిపైనే ప్రచారం చేస్తున్నారు. ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మతో కలిసి ప్రధాన గ్రామాల్లో రోడ్‌షోలు చేస్తున్నారు. ‘‘కొంగు చాచి అడుగుతున్నా.. ప్రత్యర్థులు నా భర్తను కాలు కదపకుండా చేశారు. దయచేసి ఓటు వేయండి’’ అంటూ తిక్కారెడ్డి భార్య ప్రజలను అభ్యర్థిస్తున్నారు.