పోలవరం ప్రాజెక్టును రెండో రోజు పరిశీలించిన డ్యాం డిజైన్ కమిటీ.. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పేసిన కమిటీ చైర్మన్ ఏ బి.పాండ్యా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని డ్యాం డిజైన్‌ కమిటీ తెలిపింది. రాజమండ్రిలో 16వ పోలవరం ప్రాజెక్టు డ్యాం డిజైన్ ప్యానల్..

పోలవరం ప్రాజెక్టును రెండో రోజు పరిశీలించిన డ్యాం డిజైన్ కమిటీ.. ప్రాజెక్టు  ఎప్పుడు పూర్తవుతుందో చెప్పేసిన కమిటీ చైర్మన్ ఏ బి.పాండ్యా

Updated on: Feb 21, 2021 | 5:23 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని డ్యాం డిజైన్‌ కమిటీ తెలిపింది. రాజమండ్రిలో 16వ పోలవరం ప్రాజెక్టు డ్యాం డిజైన్ ప్యానల్ సమీక్ష సమావేశం డ్యాం డిజైన్ ప్యానల్ చైర్మన్ ఏ.బి. పాండ్యా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏ.బి. పాండ్యా పోలవరం ప్రాజెక్టు 48 గేట్లుకుగానూ 29 గేట్లు అమరిక పూర్తయిందని, మిగిలిన గేట్లు అమరికపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా పేర్కొన్నారు. పోలవరంలో 52 మీటర్ల ఎత్తున స్పిల్వే పిల్లర్ల నిర్మాణం పూర్తి అయ్యింది. స్పిల్ వే బ్రిడ్జి 1128 మీటర్లుకుగానూ 1105 పూర్తి చేయడం జరిగింది. 48 గేట్లకు గానూ 29 గేట్లు బిగింపు పూర్తయింది. గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు,పవర్ ప్యాక్ లు అమార్చే పనులు వేగవంతం సాగుతున్నాయని తెలిపారు. గెడ్డర్లు అమరిక నేటితో పూర్తయిందని వివరించారు.

అయిదు అంశాలపై సమావేశంలో చర్చించారు. వరదలు సమయంలో కోతకు గురైన ఎడమ గట్టు పరిరక్షణ చర్చకు వచ్చింది. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఇఓ చంద్రశేఖర్ అయ్యార్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ సి. నారాయణ రెడ్డి ,పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Read more:

ఏపీ సీఎం జగన్‌పై నీతి ఆయోగ్‌ ప్రశంసలు.. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని అభినందిస్తూ ట్వీట్‌

Loading...
Unable to load recommendations.
Follow Us