ఈనెల 9న జరిగే టీఆర్‍ఎస్ సభను విజయవంతం చేద్దాం

| Edited By: Srinu

Mar 06, 2019 | 6:24 PM

ఈనెల 9న చేవెళ్ల‌లో జరిగే సన్నాహక సభలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారని…సభను విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. చేవెళ్లలో టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో […]

ఈనెల 9న జరిగే టీఆర్‍ఎస్ సభను విజయవంతం చేద్దాం
Follow us on

ఈనెల 9న చేవెళ్ల‌లో జరిగే సన్నాహక సభలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారని…సభను విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. చేవెళ్లలో టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ కీలకపాత్ర పోషించనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అరెకపూడి గాంధీ, మెతుకు ఆనంద్‌, మహేష్‌రెడ్డి హాజరయ్యారు.