గరీబీ హఠావో నినాదంపై హరీశ్ రావు విమర్శ

|

Mar 28, 2019 | 9:49 PM

హైదరాబాద్: పేదల పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్ పార్టీ పని అని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. 1971లో ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఇచ్చినప్పటినుంచి ఇప్పటికీ రాహుల్ గాంధీ కూడా అదే నినాదాన్ని చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఆ నినాదం చేస్తున్న రాహుల్, పేదలు ఇంకా పేదలుగా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ […]

గరీబీ హఠావో నినాదంపై హరీశ్ రావు విమర్శ
Follow us on

హైదరాబాద్: పేదల పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్ పార్టీ పని అని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. 1971లో ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఇచ్చినప్పటినుంచి ఇప్పటికీ రాహుల్ గాంధీ కూడా అదే నినాదాన్ని చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఆ నినాదం చేస్తున్న రాహుల్, పేదలు ఇంకా పేదలుగా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్నారు.