బెంగళూరు : కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే గుల్బర్గా ఎంపీ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఖర్గే తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. 2009 నుండి గుల్బర్గా నియోజకవర్గం నుంచి పార్లమెంట్కు ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల అనంతరం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గే కొనసాగుతున్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీకి 10 సార్లు పోటీ చేయగా, వరుసగా తొమ్మిది సార్లు గెలిచి ఖర్గే రికార్డు సృష్టించారు.