కన్నతల్లే చంపేసింది.. వీడిన 16 రోజుల పసికందు మృతి మిస్టరీ
తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం మండలం చిన్న కొండేపూడిలో సంచలనం సృష్టించిన 16 రోజుల పసికందు మృతి మిస్టరీ వీడింది.
తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం మండలం చిన్న కొండేపూడిలో సంచలనం సృష్టించిన 16 రోజుల పసికందు మృతి మిస్టరీ వీడింది. కన్న తల్లి సుజననే ఆ పసికందును బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు ఈ కేసులో భాగస్వామ్యం అయ్యారని.. ముగ్గురిని అరెస్ట్ చేశామని వారు వెల్లడించారు. ఆడపిల్ల పుట్టడంతో తల్లి, శిశువు అమ్మమ్మ, మరో మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వారు తెలిపారు.
మూడు తరాల నుంచి కుటుంబంలో ఆడపిల్లలే అవ్వడం,పెంపకం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఇందుకోసం 15 రోజులు ఆలోచించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ నెల 4 వ తేదీన సృజనకు ఆడపిల్లకు జన్మించగా.. 18వ తేదీన రాత్రి ఆ పసికందు అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందివ్వగా.. దర్యాప్తు చేపట్టిన వారు ఓ బావిలో పసికందు మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తరువాత విచారణలో కన్నతల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలింది.
Read This Story Also: డీఎంకేను కుదిపేస్తున్న కరోనా.. మరో ఎమ్మెల్యేకు పాజిటివ్