#NarendraModi : ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న పేరు ప్రధాని మోదీ.. ఆ తర్వాత స్థానంలో ఎవరంటే…

మొత్తం భారతీయ ట్విట్టర్ ఎంగేజ్‌మెంట్ ర్యాంకింగ్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7.2 మిలియన్లకు పైగా ఎంగేజ్‌మెంట్‌లతో అగ్రస్థానంలో నిలిచారు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 3.5 మిలియన్ ఎంగేజ్‌మెంట్‌లతో ఉన్నారు, సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ ట్విట్టీట్ అక్టోబర్లో ఒక నివేదిక ప్రకారం...

#NarendraModi : ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న పేరు ప్రధాని మోదీ.. ఆ తర్వాత స్థానంలో ఎవరంటే...
Follow us

|

Updated on: Nov 24, 2020 | 7:24 AM

మోదీ…మోదీ..మోదీ.. ఇప్పుడు ప్రపంచం మొత్తం చెప్పుకుంటున్నపేరు ఇదే. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా సోషల్‌ మీడియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (#NarendraModi) పేరు వినిపిస్తోంది. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ ప్రధాని మోదీ పేరుపైననే ఉన్నాయంటే నమ్మండి. ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను ‘చెక్‌బ్రాండ్స్‌’ సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో 95 మంది టాప్‌ పొలటికల్‌ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌ పరిశీలించింది.

దాదాపు 10 కోట్ల ఆన్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ ఆధారంగా ఈ తొలి నివేదికను ప్రకటించింది. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, వికీ, యూట్యూబ్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ ప్రధాని మోదీ పేరుపైననే ఉన్నాయని తెలిపింది. మొత్తం భారతీయ ట్విట్టర్ ఎంగేజ్‌మెంట్ ర్యాంకింగ్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7.2 మిలియన్లకు పైగా ఎంగేజ్‌మెంట్‌లతో అగ్రస్థానంలో నిలిచారు.

ఈ నివేదిక ప్రకారం..7.2మిలియన్ 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలవగా.. మోదీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. తదుపరి స్థానాల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 3.5 మిలియన్ ఎంగేజ్‌మెంట్‌లతో ఉన్నారు. సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ ట్విట్టీట్ అక్టోబర్లో ఒక నివేదికను వెల్లడించిది. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు.

బ్రాండ్‌ స్కోర్‌ విషయంలోనూ 70 స్కోర్‌తో మోదీ తొలి స్థానంలో ఉన్నారు. సోషల్‌మీడియా వేదికలపై ఫాలోవర్స్, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్‌మెంట్, మెన్షన్స్‌.. ఆధారంగా బ్రాండ్‌ స్కోర్‌ను నిర్ధారిస్తారు. ఈ స్కోర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 36.43 స్కోర్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో, సోమవారం మరణించిన అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ (31.89), అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ (31.89), యూపీ సీఎం ఆదిత్యనాథ్‌(27.03) ఉన్నారు.