కరోనా కల్లోలంతో నిత్యం రద్దీగా ఉండే థాయ్ వీధులు ఖాళీ అయిపోయాయి. పర్యాటకులు లేరు.. స్థానికులు బయటకు వెళ్లాలంటే భయం దీంతో ట్యాక్సీ డ్రైవర్లకు పని లేకుండా పోయింది. చాలామంది డ్రైవర్లు సొంత ఊర్లకు చేరుకున్నారు, దీంతో టాక్సీలను వాడకుండా దాదాపు ఏడాదిన్నర నుంచి వదిలేశారు. ఇప్పుడు ఆ ట్యాక్సీల పై మొక్కల పెంపకం చేపట్టారు. ఇలా మొక్కలను పెంచి తమ డ్రైవర్లకు, తమ సంస్థ ఉద్యోగులకు కాయగూరలు సరఫరా చేయవచ్చని కొన్ని సంస్థలు భావించాయి.
వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై కప్పును మొక్కలు పెంచేందుకు వాడాలని రాచఫ్రూయక్ ట్యాక్సీ కోపరేటివ్ సంస్థ ఆలోచించింది. వెంటనే ఈ సంస్థలోని ఉద్యోగులు వెదురు కర్రలకు నల్లని బిన్ కవర్లు పెట్టి ఒక ఫ్రేమ్గా తయారు చేశారు. దానిపై మట్టిని పరిచి చిన్న చిన్న ఆకు కూర మొక్కలను చడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పచ్చి మిర్చి, దోసకాయలు, కీరా వంటి మొక్కలు వేశారు.
పర్యాటక రంగంపై ఆధారపడిన బ్యాంకాక్లో లో ఇప్పుడు టాక్సీలకు.. డ్రైవర్లకు పనిలేకుండా పోయింది. దీంతో ఆర్ధికంగా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో టాక్సీలపై కూరగాయలు పండిస్తే.. వాటిని ముందుగా డ్రైవర్లకు ఇచ్చి.. మిగిలిన వాటిని అమ్మకానికి పెట్టి డబ్బులు సంపాదించాలని సదరు సంస్థ భావిస్తోంది.
పర్యటక రంగంపైనే ఆధారపడిన థాయిలాండ్ లో కోవిడ్ నిబంధనలతో వ్యాపార కార్యకలాపాలు నిలిచి పోయాయి. దీంతో టాక్సీపై మొక్కలు పెంచుతూ.. దానికి " ప్రధానమంత్రి గారు.. మాకు సహాయం చేయండి" అనే ఓ బోర్డు కూడా కట్టారు. అంతేకాదు తమకు బతకడానికి మిగిలిన చివరి మార్గం అని ఒక కంపెనీ యజమాని చెప్పారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇలా టాక్సీల మీద మొక్కలు పెంచడం వలన కార్లు పాడైపోతాయి కదా అన్న సందేహానికి ఓ కంపీనీ యజమాని స్పందిస్తూ.. ట్యాక్సీల పై కప్పుపై కాయగూరలు పెంచడం వల్ల ట్యాక్సీలకు కలిగే నష్టం ఏమీలేదని.. ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా టాక్సీలు వాడకపోవడంతో.. "చాలా ట్యాక్సీలు మరమ్మతులకు కూడా పనికి రాకుండా అయిపోయాయనిచెప్పారు. ఇక మరికొన్ని కార్లు ఇంజన్లు, టైర్లు పూర్తిగా పాడైపోయాయి అన్నారు. అందుకనే ఇలా మొక్కలు పెంచుతున్నామని ఈ కార్లలో చాలా కార్లు లోన్ తీసుకుని కొన్నవే.. వాటి అప్పు ఇంకా తీరలేదు.. వాయిదాలు చెల్లించాల్సి ఉంది. కనుక ఇలా సరికొత్త ప్రయత్నం చేస్తూ ఆదాయాన్ని సృష్టించుకుంటున్నామని తెలిపారు