
భూటాన్: హిమాలయాలలో కనిపించే అహింసా దేశం భూటాన్. ఇది పచ్చని లోయలు, స్వచ్ఛమైన గాలికి ప్రసిద్ధి చెందింది. భారత పౌరులకు భూటాన్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీకు కావలసిందల్లా ఓటరు కార్డు లేదా పాస్పోర్ట్ వంటి సరైన గుర్తింపు కార్డు. భూటాన్ ప్రకృతి, సంస్కృతులు, పురాతన మఠాలతో సమృద్ధిగా ఉంది. వీటిని మీరు పారో, థింఫు, పునాఖా వంటి ప్రదేశాలలో కనుగొనవచ్చు.

నేపాల్: భారతీయులకు అత్యంత దగ్గరగా ఉన్న స్నేహపూర్వక దేశాలలో నేపాల్ ఒకటి. ఇది వీసా లేకుండా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. భారతీయ పర్యాటకులు ఖాట్మండు, పోఖారా, లుంబినీ వంటివి ఇక్కడ సందర్శించవచ్చు. మీరు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా సందర్శించవచ్చు. అలాగే పర్వతాలలో ఒక చిన్న ట్రెక్ చేయవచ్చు. దాని ఆహార సంస్కృతి, నేపాల్ దేశం భాష స్వదేశాన్ని పోలి ఉంటాయి.

ఇండోనేషియా: ఇండోనేషియా అందమైన దీవుల సముదాయం. ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశం బాలి. భారతీయుల ఇక్కడా వీసా అవసరం లేకుండా 30 రోజులు ఉండవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో బీచ్లు, దేవాలయాలు, అగ్నిపర్వతాలు సందర్శించవచ్చు. బాలి యోగా కేంద్రాలు, విశ్రాంతి బసలకు కూడా ప్రసిద్ధి. కాబట్టి ఇది జంటలు, ఒంటరి ప్రయాణికులకు మంచి ఎంపిక.

మారిషస్: మరో ద్వీప స్వర్గం మారిషస్. భారతీయ పౌరులకు ఈ దేశంలో 90 రోజుల వీసా రహిత ప్రవేశం లభిస్తుంది. ఈ గమ్యస్థానం మృదువైన ఇసుక, స్వచ్ఛమైన నీరు,స్నేహపూర్వక ప్రజలతో సమృద్ధిగా ఉంటుంది. మారిషస్ హనీమూన్, కుటుంబంతో వెళ్ళడానికి అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ జలపాతాలు, టీ తోటలను సందర్శించవచ్చు, మీరు పడవ ప్రయాణాలను కూడా ఆస్వాదించవచ్చు. ఇక్కడ, భారతీయ ఆహారం, సంస్కృతి కూడా ఉంటుంది. అనేక హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది.

జమైకా: జమైకా ఒక కరేబియన్ రాష్ట్రం. బీచ్లు, రంగురంగుల సంస్కృతి, సంగీతనికి ప్రసిద్ధి. భారతీయ పర్యాటకులు 30 రోజుల వరకు వీసా లేకుండా జమైకాకు వెళ్లడానికి అనుమతించబడతారు. మీరు కొత్త అనుభవాన్ని కోరుకుంటే ఇది మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. జమైకా తాజా ఆహారం, సంగీత ఉత్సవాలు, ప్రకృతికి ఆకర్షితులు అవుతారు.