
బాబా వెంగా రాసిన 'ది ఫ్యూచర్' పుస్తకంలో జపాన్ దేశంలో జూలై నెలలో గొప్ప వరద వస్తుందని, దీని కారణంగా చాలా పెద్ద మార్పులు సంభవిస్తాయని ఉంది. అందుకే జపాన్ వాసులు తగ భయపడుతున్నారు. అయితే గతం జపాన్ విషయం బాబా వెంగా చెప్పిన నిజం కావడమే దీనికి ప్రధాన కారణం.

బాబా వెంగా చెప్పిన జోస్యం ప్రకారమే 2011లో ఓసారి జపాన్ని సునామీ రూపంలో సముద్రుడు ముంచెత్తాడు. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20 వేలకుపై ప్రజలు మరణించారు. ఇది జపాన్ చరిత్రలో భారీ సునామీగా చెబుతారు. ఇప్పటికి మళ్లీ అలంటి ప్రళయం రాలేదు.

ఒక్కటే కదా నిజమైంది కదా అనుకొంటున్నారేమో దీని ముందు కూడా ఆమె జ్యోష్యం ప్రకారం ఓ సంఘటన జరిగింది. అదే గ్రేట్ హాన్షిన్ భూకంపం లేదా కోబ్ భూకంపం. 20వ శతాబ్దంలో జపాన్లో రెండవ అత్యంత ప్రాణాంతకమైన భూకంపం. జనవరి 17, 1995న హ్యోగో ప్రిఫెక్చర్ దక్షిణ భాగాన్ని 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కుదిపేసింది. భూమి దాదాపు 20 సెకన్ల పాటు కంపించి 5,000 మందిని చంపింది.

ఆమె చెప్పిన ప్రకారం దీనికి ముందు కూడా మరికొన్ని జరిగాయని తెలుస్తోంది. ఈ ఏడాది జులై 5న జపాన్లో మరోసారి సునామీ వస్తోందని బాబా వంగా భవిష్యవాణిలో ఉంది. అయితే ఈసారి ముందు కంటే భారీగా సముద్ర మట్టానికి మూడు రెట్లు ఎత్తులో అలలు ఎగసి పడతాయని ప్రిడిక్షన్ ఉంది. దీనివల్ల పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది.

దీని కారణంగా చాలా మంది తమ జపాన్ టూర్ విరమించుకున్నారు. హోటల్, విమాన టిక్కెట్ల బుకింగ్లను కూడా రద్దు చేసుకున్నారు. మరి జూలై 5 న నిజంగా సునామీ జపాన్ను తాకుతుందా? ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిపై దృష్టి పెడుతోంది. ఇది జరిగితే జపాన్ మరోసారి భారీ నష్టం తప్పదు అంటున్నారు నిపుణులు. మరో వైపు సునామీ సూచనలు ఏమి లేవని జపాన్ అధికారులు తేల్చి చెప్పసారు.