
భారతీయుల ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈరోజు గణపతి విగ్రహాలను వాడల్లో మండపాలు ఏర్పాటు చేసి పెట్టి పూజిస్తారు. కొందరు తమ ఇంటిలో కూడా చిన్న బొజ్జగణపయ్య విగ్రహాన్ని పూజిస్తుంటారు. ఇక ఈ రోజున అందరికళ్లు వినాయ విగ్రహాలపైనే ఉంటుంది. కొందరు పెద్దవి, ఇంకొందరు చిన్నది తెస్తుంటారు. అయితే ముఖ్యంగా కొందరు తొండం ఎడమ వైపు ఉన్నవి, ఇంకొందరు కుడి వైపు తొండం ఉన్నవి, మరికొందరు మధ్యలో ఉన్నది తీసుకొస్తారు. కాగా, ఇప్పుడు మనం ఏ వైపు తొండం ఉన్నది పూజించడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం కుడి వైపుకు తొండం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని దక్షిణాభిముఖి గణేశుడు అంటారంట. ఇలా ఉన్న వినాయకుడి విగ్రహం చాలా శక్తివంతమైనదంట. ఇలాంటి విగ్రహాన్ని చాలా పూజించడానికి చాలా నియమ నిబంధనలు ఉంటాయంట. దేవాలయల్లో ఉండే నియమాలతో పూజలు నిర్వహించాలంట. గణేశుడి విడ్రహం తొండం కుడివైపున ఉంటే కఠినపైన ఆరాధన నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు.

ఇక మనం చాలా వరకు చూసే గణపతి విగ్రహాలు ఎడమ వైపున తొండం ఉన్నవే ఉంటాయి. ఇటువంటి విగ్రహాలు చాలా ప్రశాంతంగా, సంపన్నంగా ఉండటమే కాకుండా శాంతి, సౌఖ్యం, సంపదను సూచిస్తాయంట.ముఖ్యంగా ఈ వైపు తొండం ఉన్న విగ్రహాలను చంద్రుడితో పోలుస్తారు. ఎందుకంటే? ఎడమ వైపు ఉన్న విగ్రహాలకు చంద్రుడి లక్షణాలు ప్రశాంతత, చల్లదనం, సానుకూలం వంటివి ఉండటం వలన చాలా వరకు ఈ విగ్రహాలను పూజించడం మంచిదంట.

ఇక కొన్ని విగ్రహాలకు పైకి, కిందికి, ఎదురుగా కూడా ఉంటాయి. అయితే వినాయకుడి విగ్రహం పైకి తొండం ఉంటే అది మంచి జ్ఞానాన్ని పొందడానికి చిహ్నంఅంట. దీని వలన భక్తులు ఉన్నతమైన జ్ఞానాన్ని పొందడమే కాకుండా, ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఈ రకమైన విగ్రహాలను పూజిస్తారంట. ఇక కిందికి తొండం ఉన్న విగ్రహాలు విజయాన్ని ప్రసాదించడమే కాకుండా కోరిన కోర్కెలు నెరవేరుస్తాయని చెబుతున్నారు పండితులు.

ఇక కొంత మంది ఇలాంటి నియమ నిబంధనలు లెక్క చేకుండా, ఏలా అయినా దేవుడు దేవుడే అంటూ తమకు నచ్చిన విగ్రహాలు తెచ్చుకొని పూజిస్తారు. కానీ కొంత మంది కుడి వైపు తొండం ఉన్న గణేశుడు, చాలా శక్తివంతడని నమ్ముతారు. ఇంకొందరేమో ఎడమవైపు ముఖంగా తొండం ఉన్న వినాయకుడు దయగలవాడు, మంచి బుద్దిబలం, విద్యాబలం ప్రసాదిస్తాడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడని చెబుతుంటారు. అయితే శక్తివంతుడని కుడివైపున తొండం ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేస్తే, తప్పకుండా ఆచారాలు, నియమాల ప్రకారం పూజలు జరిపించాలంట. లేకపోతే చాలా సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు పండితులు.