
ఇండియా మోస్ట్ సెలబ్రిటీ కపుల్గా గర్తింపు పొందిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. తమ కూతురుకి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

ఇజ్రాయెల్లోని మిట్జ్పేలో గల నెగెవ్ ఎడారిలో రామన్ క్రేటర్ వరకు నిర్మించిన రోడ్డు మార్గం ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ రోడ్డు మార్గం అచ్చం పాము మాదిరిగా అద్భుతంగా ఉంది.

ఇజ్రాయెల్లోని మిట్జ్పేలో గల నెగెవ్ ఎడారిలో రామన్ క్రేటర్ వరకు నిర్మించిన రోడ్డు మార్గం ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ రోడ్డు మార్గం అచ్చం పాము మాదిరిగా అద్భుతంగా ఉంది.

కరోనా రెండవ వేవ్ కారణంగా భారత్ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. కరోనా కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఒక్క రోజులోనే కరోనా కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఏప్రిల్ 22, 2021న దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా కారణంగా చనిపోయిన వారికి సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఏడాది విపరీతంగా వైరల్ అయిన ఫోటోల్లో ఈ ఫోటో కూడా ఉంది.

ఓ పధ్నాలుగేళ్ళ వయసున్న గొరిల్లా తన అలనాపాలనా చూసుకున్న సంరక్షుడి ఒడిలో తాజాగా ప్రాణాలొదిలింది. కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్లో ఈ విషాదకర ఘటన జరిగింది. 2007లో అడవిలో తల్లి గొరిల్లా మృతదేహాన్ని పట్టుకుని వదలకుండా ఉన్న రెండేళ్ళ పిల్ల గొరిల్లాను రేంజర్లు గుర్తించారు. సంరక్షణ కేంద్రంలో ఉంచి పెంచుకున్నారు. గొరిల్లాకు ఎన్డకాసి అనే పేరు పెట్టారు. 2019లో తన సంరక్షకుడు ఆండ్రీతో కలిసి గొరిల్లా దిగిన సెల్ఫీ ఫొటో వైరల్ అయ్యింది.

చైనాలోని యుక్సీ, యునాన్ ప్రావిన్స్లోని యువాన్జియాంగ్లో గల యువాన్జియాంగ్ నది వంతెనపై ఆసియా ఏనుగుల గుంపులు నడుస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఏనుగుల గుంపు నడుస్తున్న ఫోటో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయ్యింది.

2014 నుండి ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా విపరీతమైన రక్తపాతం జరిగింది. ఈ యుద్ధంలో భాగంగా వైమానిక దాడులు కూడా జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే 24న గాజాలోని బీట్ హనౌన్లో ఒక చిన్నారి బాలిక కూలిన ఇంట్లో నిల్చుని ధీనంగా చూస్తుంది. ఈ హృదయ విధారక చిత్రం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ఇజ్రాయెల్ రాకెట్ దాడుల ప్రతిఫలం ఆ దృశ్యం. ఈ ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది.

కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని అతలాకుతలం చేసింది. కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సంక్షోభం సమయంలో ఓ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో అమ్మాయి ధైర్యం ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్లకు భయపడి ఎంతో ఆప్ఘన్ పౌరులు ఆ దేశించి పారిపోయారు. విమానాల్లో ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చొని బతుకు జీవుడా అంటూ తరలిపోయారు. విమానాల్లో తరలివెళ్తున్న ప్రజల ఫోటో అప్పట్లో సంచలనం సృష్టించింది.