7 / 9
భారత సంతతికి చెందిన అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు అక్కడి రాజకీయాల్లో కీలకస్థానాల్లో ఉన్న భారత మూలాలు కల్గిన నేతలు భారత్తో మెరుగైన, బలమైన సంబంధాలు కోరుకుంటున్నారు. భారత్ కూడా భారత మూలాలు కలిగిన ప్రజల పట్ల ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన 'ప్రవాసి భారతీయ దివస్' కార్యక్రమానికి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీని చీఫ్ గెస్టుగా ఆహ్వానించింది. ఆ దేశ అవసరాలు తీర్చే వస్తువులతో పాటు రక్షణ పరికరాలను కూడా భారత్ అందజేస్తోంది. ఎసెక్విబో ప్రాంతంలో గుర్తించిన చమురు నిక్షేపాల వెలికితీత ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన భారత్కు, వెనిజ్యులా దుష్టపన్నాగం విఘాతం కల్గిస్తుంది. అందుకే గయానా ఈ యుద్ధ భయం విషయంలో అమెరికాతో పాటు భారత్ను ఆశ్రయించి, యుద్ధం తలెత్తకుండా ఆపాలని కోరుతోంది.