బ్యాంకులు వినియోగదారులకు సులభతరమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ సేవలు సులభతరం చేస్తున్నాయి. rఇప్పుడు యూపీఐ సహాయంతో డబ్బులు తీసుకునే వెసులు బాటు వచ్చేసింది.
తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు శుభవార్త అందిచింది. తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇందు కోసం ఇంటర్ఆపరేటబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయిల్ (ఐసీసీడబ్ల్యూ)ను అందుడబాటులోకి తీసుకువచ్చింది. ఖాతాదారులు వారి మొబైల్ ఫోన్లలో ఐసీసీడబ్ల్యూను ఎనేబుల్ చేసిన యూపీఐ అప్లికేషన్ ద్వారా డెబిట్ కార్డు లేకుండానే బీవోబీ ఏటీఎంలో నగదును విత్డ్రా చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో 'యూపీఐ క్యాష్ విత్డ్రాయిల్'ను ఎంచుకుని డ్రా చేసుకోవాల్సిన మొత్తాన్ని నమోదు చేసి ఏటీఎం స్క్రీన్పై డిస్ప్లే అయ్యే క్యూఆర్ కోడ్ను యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు యూపీఐ పిన్ వస్తుంది. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ. 5,000కాగా, రోజుకు రెండు లావాదేవీలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశం అంతటా 11,000 పైగా ఏటీఎంలను నిర్వహిస్తోంది. వరల్డ్లైన్ నివేదిక ప్రకారం.. 2022లో యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ. 149.5 లక్షల కోట్ల యూపీఐ, కార్డ్ లావాదేవీలు జరిగాయి.