TTD: తిరుపతి పుట్టిన రోజు సందర్భంగా నగర ప్రజలకు ప్రత్యేక ఆహ్వానాలు.. టీటీడీ ఛైర్మన్ భూమన..

| Edited By: Srikar T

Feb 23, 2024 | 9:07 PM

టెంపుల్ సిటీ బెర్త్ డే జరగనుంది. తిరుపతి ఆవిర్భవదినాన్ని పండగగా చేసుకుందాం అంటూ తిరుపతిలో పెద్ద ఎత్తున ఆహ్వాన పత్రిక అందించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ఫ్లెక్సీలు కట్టి నగర ప్రజలకు చాటిచెప్పారు భూమన. రేపు తిరుపతి 894వ పుట్టిన రోజు పండగను అంతా కలసి చేసుకుందాం.. రండి అని నగరవాసులను ఆహ్వానించారు. గాంధీ రోడ్డులో ఫ్లెక్సీలు కట్టి, కరపత్రాలు పంచి ప్రచారం చేసిన భూమన తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ప్రపంచంలో మనషులు, జంతువులకు మాత్రమే పుట్టిన రోజు పండగలు నిర్వహించుకునే పరిస్థితి ఉందన్న భూమన ప్రాంతాలకు పుట్టిన రోజులు లేవన్నారు.

1 / 5
టెంపుల్ సిటీ బెర్త్ డే జరగనుంది. తిరుపతి ఆవిర్భవదినాన్ని  పండగగా చేసుకుందాం అంటూ తిరుపతిలో పెద్ద ఎత్తున ఆహ్వాన పత్రిక అందించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ఫ్లెక్సీలు కట్టి నగర ప్రజలకు చాటిచెప్పారు భూమన. రేపు తిరుపతి 894వ పుట్టిన రోజు పండగను అంతా కలసి చేసుకుందాం.. రండి అని నగరవాసులను ఆహ్వానించారు.

టెంపుల్ సిటీ బెర్త్ డే జరగనుంది. తిరుపతి ఆవిర్భవదినాన్ని పండగగా చేసుకుందాం అంటూ తిరుపతిలో పెద్ద ఎత్తున ఆహ్వాన పత్రిక అందించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ఫ్లెక్సీలు కట్టి నగర ప్రజలకు చాటిచెప్పారు భూమన. రేపు తిరుపతి 894వ పుట్టిన రోజు పండగను అంతా కలసి చేసుకుందాం.. రండి అని నగరవాసులను ఆహ్వానించారు.

2 / 5
గాంధీ రోడ్డులో ఫ్లెక్సీలు కట్టి, కరపత్రాలు పంచి ప్రచారం చేసిన భూమన తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ప్రపంచంలో మనషులు, జంతువులకు మాత్రమే పుట్టిన రోజు పండగలు నిర్వహించుకునే  పరిస్థితి ఉందన్న భూమన ప్రాంతాలకు  పుట్టిన రోజులు లేవన్నారు. అయితే  పరంధాముడు వెలసిన మన తిరుపతికి మాత్రమే పుట్టిన రోజు ఉందన్నారు.

గాంధీ రోడ్డులో ఫ్లెక్సీలు కట్టి, కరపత్రాలు పంచి ప్రచారం చేసిన భూమన తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ప్రపంచంలో మనషులు, జంతువులకు మాత్రమే పుట్టిన రోజు పండగలు నిర్వహించుకునే పరిస్థితి ఉందన్న భూమన ప్రాంతాలకు పుట్టిన రోజులు లేవన్నారు. అయితే పరంధాముడు వెలసిన మన తిరుపతికి మాత్రమే పుట్టిన రోజు ఉందన్నారు.

3 / 5
జగద్గురు రామానుజాచార్యులు వారి అమృత హస్తాలతో తిరుపతికి 24.02.1130న శంకుస్థాపన చేశారన్నారు భూమన. తిరుమల అర్చకుల కోసమే ఏర్పాటు చేసిన తిరుపతికి అప్పట్లో  గోవిందరాజపురంగా నామకరణ చేశారని చెప్పారు. ఇందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు.

జగద్గురు రామానుజాచార్యులు వారి అమృత హస్తాలతో తిరుపతికి 24.02.1130న శంకుస్థాపన చేశారన్నారు భూమన. తిరుమల అర్చకుల కోసమే ఏర్పాటు చేసిన తిరుపతికి అప్పట్లో గోవిందరాజపురంగా నామకరణ చేశారని చెప్పారు. ఇందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు.

4 / 5
గత రెండేళ్లుగా తిరుపతి పుట్టిన రోజు పండగను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామన్నారు భూమన. ఈ ఏడాది మరింత గొప్పగా నిర్వహించ తలపెట్టినట్లు భూమన చెప్పారు. తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం వద్ద నిర్వహించే పవిత్ర శోభా యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు భూమన కరుణాకర రెడ్డి.

గత రెండేళ్లుగా తిరుపతి పుట్టిన రోజు పండగను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామన్నారు భూమన. ఈ ఏడాది మరింత గొప్పగా నిర్వహించ తలపెట్టినట్లు భూమన చెప్పారు. తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం వద్ద నిర్వహించే పవిత్ర శోభా యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు భూమన కరుణాకర రెడ్డి.

5 / 5
ఫిబ్రవరి 24న తిరుపతి అవిర్భావ దినోత్సవం సందర్భంగా శోభాయాత్ర జరగనుండటంతో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ మాడ వీధులకు అనుసంధానంగా అన్ని రోడ్లను తాత్కాలికంగా మూసి వేయనున్నారు.
ఉదయం 6 నుంచి 12 గంటల వరకు తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తిరుపతి ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

ఫిబ్రవరి 24న తిరుపతి అవిర్భావ దినోత్సవం సందర్భంగా శోభాయాత్ర జరగనుండటంతో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ మాడ వీధులకు అనుసంధానంగా అన్ని రోడ్లను తాత్కాలికంగా మూసి వేయనున్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తిరుపతి ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.