
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే త్రిఫల నానబెట్టిన నీటిని తాగే అలవాటు ఉంటుంది. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. త్రిఫలానికి వెయ్యి గుణాలు ఉన్నాయని ఆయుర్వేద గ్రంధాలు కూడా చెబుతున్నాయి. త్రిఫల అనేది నిజానికి సంస్కృత పదం.

ఇది మూడు పండ్ల మిశ్రమం కాబట్టి దీనిని త్రిఫల అంటారు. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను కలిపి త్రిఫలం అంటారు. ఒక్కో పండులో ఒక్కో రకమైన పోషక, ఆరోగ్య గుణాలు ఉంటాయి.

త్రిఫల మూడు పండ్ల మిశ్రమంతో తయారవుతుంది. దీన్ని ఎంతో నాణ్యతగా తయారు చేస్తారు. దీని ప్రయోజనాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయని చెప్పనవసరం లేదు. అయితే ఈ త్రిఫలం తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే ఉపయోగం ఏమిటో నిపుణుల మాటల్లో మీకోసం..

త్రిఫల జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది ఉదయాన్నే త్రిఫల లేదా త్రిఫల నానబెట్టిన నీటిని తాగుతారు. అయితే దీనితోపాటు గ్యాస్ మందు తీసుకోకూడదని ఆయుర్వేద గ్రంథాలలో సూచించారు. ఆయుర్వేద వైద్యులు కూడా అలాగే చెబుతున్నారు.

త్రిఫల ప్రభావంతో దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాలపై ఉండే పసుపు మరకలను తొలగించడం, చిగుళ్ళ నుంచి రక్తస్రావం నివారించడం, నోటి దుర్వాసనను తొలగించడం.. ఎన్నో దంత సమస్యలను త్రిఫల నివారిస్తుంది. అలాగే త్రిఫల నానబెట్టిన నీరు అదనపు కొవ్వును పోగొట్టడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే త్రిఫల తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు మెరుగు పడుతుంది.