
మినపప్పు పాయసం తినడం వలన మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. ఇంకా ఇది స్వీట్ గా, కమ్మగా ఉంటుంది. మినపప్పు, బెల్లం, పాలు వేసి దీనిని ఇంట్లోనే సులభంగా తినొచ్చు. ఇంకా ఇది కండరాల సమస్యను కూడా తగ్గించగలదు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: రెండు కప్పుల కప్పు మినపప్పు, మూడు కప్పుల పాలు, ఒక కప్పు బెల్లం ముక్కలు, కప్పున్నర పంచదార, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పు, 10 కిస్మిస్ కొద్దిగా, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేస్తే రుచిగా ఉంటుంది. అయితే, దీనిని సరైన కొలతలతో చేయాలి.

ముందుగా మినపప్పును రెడీ చేసుకోవాలి: ఒక పాత్ర తీసుకుని దానిలో మినపప్పును వేసి ఒకటికి రెండు సార్లు కడగాలి. ఆ తర్వాత ఈ వీటిని ఉడకబెట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా దీనిని తీసుకుని ఒక పాత్ర పెట్టి దానిలో పాలు పోసి వాటిని బాగా మరిగించాలి. ఆ ఆ తర్వాత బెల్లం ముక్కలు వేయాలి.

బాదం పప్పును ఇలా వేయించుకోవాలి: ఇప్పుడు ఇంకో చిన్న పాన్ గ్యాస్ మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి బాదం పప్పులు , కిస్మిస్ లు కూడా వేయించి వాటిని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాలలో బాగా కరిగిపోయే వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి.

ఫినిషింగ్ టచ్ : చివర్లో వేయించిన జీడిపప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసి తినడమే. అంతే, వేడి వేడి మినపప్పు పాయసం రెడీ. పిల్లలు నుంచి పెద్దల వరకు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.