
బెల్లంతో చేసుకునే ఆకు తెరళి కుడుములు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు బియ్యంపిండి, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు కొబ్బరి తురుము, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 10 ఇస్తరాకులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు మంచి నీళ్ళను తీసుకోవాలి. ఇది కేరళలో చాలా ఫేమస్.

పిండిని ఇలా రెడీ చేసుకోవాలి: ఒక పాత్ర తీసుకుని దానిలో నీరు పోసి బాగా మరిగించి దానిలో కొద్దిగా ఉప్పు, ఇంకా దీనిలో నెయ్యి కూడా వేసి బియ్యంపిండిని బాగా కలుపాలి. మరి, ముద్దలా కాకుండా మూత పెట్టి 10 నిముషాలు అలాగే, ఉంచాలి. ఆ తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఆకులను కూడా సిద్ధం చేసుకోవాలి: అరటి ఆకులు లేదా ఇస్తరాకులను తీసుకుని వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, వీటిని తీసుకుని మీడియం మంటపై వేడి చేస్తే ఆకులు ఈజీగా మడవచ్చు. మీరు మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మంచి ఆకులు తీసుకోవాలి.

కుడుములు ఇల తయారు చేసుకోవాలి: అయితే, ఈ ఆకుల మధ్యలో బియ్యం పిండిని పెట్టి, ఆ తరవాత బెల్లం-కొబ్బరి కూడా పెట్టి ఆకును మడవాలి. ఆకును మడిచేటప్పుడు జాగ్రత్తగా మడవాలి లేదంటే లోపల ఉన్న బియ్యపు పిండి సరిగా ఉడకదు. కాబట్టి, దీనిని ఒకటికి రెండు సార్లు చేసుకోండి.

ఆవిరి మీద వీటిని ఉడికించుకోవాలి : ఇప్పుడు వీటిని తీసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి కనీసం 30 నిమిషాల పాటు ఆవిరి మీద బాగా ఉడికించాలి. మీడియం మంట మీదే వీటిని ఉడికించండి లేదంటే ఆకు మాడిపోయే అవకాశం ఉంది. ఉడికిన తరవాత వీటిని కిందకు దించేయండి.