
రైస్ : అన్నాన్ని వండి తిన్న తర్వాత మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి అస్సలే మంచిదికాదంట. దీని వలన చెడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందంట. ముఖ్యంగా అన్నాన్ని పదే పదే వేడి చేసి తినడం వలన జీర్ణసమస్యలు, కడుపునొప్పి వంటివి ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

పాలకూర, ఆకుకూరలు : పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దీనిని ఒకసారి ఉడికించిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయడం అస్సలే మంచిది కాదంట.ఎందుకంటే? దీని ద్వారా సహజంగా లభించే నైట్రేట్లు, నైట్రోసమైన్లుగా మారి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పాలకూర, ఇతర ఆకుకూరలను కూడా పదే పదే వేడి చేసి తినకూడదంట.

పుట్టగొడుగులు : పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటారు. అయితే పుట్టగొడుగులను వండిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయకూడదంట. దీని వలన యాంటీఆక్సిడెంట్స్ తగ్గడమే కాకుండా, ఇది రుచిని తగ్గిస్తుందంట. కొన్ని సార్లు అనారోగ్య సమస్యలను పెంపొందిస్తుందంట.

బంగాళాదుంపల కర్రీని కూడా మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం మంచిది కాదంట. దీనిని పదే పదే వేడి చేయడం వలన హానిరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుందంట. అలాగే ఇది పిండి పదార్థంగా కూడా మారే ఛాన్స్ ఉంటుందంట. దీని వలన జీర్ణసమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందంట. ఇక బంగాళదుంప కర్రీని పదే పదే వేడి చేసి తినడం వలన కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయంట.

ఉడకబెట్టిన కోడిగుడ్డు : ఉడకబెట్టిన కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి రోజూ ఒకటి ఉడకబెట్టిన కోడి గుడ్డు తినాలని సూచిస్తారు. అందుకే చాలా మంది రోజూ ఒక కోడి గుడ్డు తింటారు. అయితే కొంత మంది వీటిని ఉడకబెట్టి ఫ్రిజ్లో పెట్టుకొని మళ్లీ వేడి చేసి తింటుంటారు. కానీ ఇలా చేయడం అస్సలే మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందంట. ( నోట్ : పై వార్త ఇంటర్నెట్ సమాచారం మేరకు ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)