
మార్చి నెల వచ్చిందంటే చాలు పరీక్షల సమయం ఆసన్నం అయినట్లే. ఇక సంవత్సరం మొత్తం ఆడుతూ పాడుతూ చదివింది ఒక ఎత్తు అయితే ఈ వార్షిక పరీక్షల్లో చదివి రాసి, తెచ్చుకున్న మార్కులు మరో ఎత్తు. సంవత్సరం మొత్తం చదివింది ఏంటి అనే దానికి జవాబు ఈ పరీక్షల్లో వచ్చే మార్కులు. దీంతో చాలా మంది విద్యార్థులు లాస్ట్ ఎగ్జామ్స్ అంటే ఎక్కువ భయపడి పోతుంటారు. కొన్ని సార్లు పరీక్షల భయంతో వచ్చిన ఆన్సర్స్ కూడా ఎగ్జామ్లో రాయలేక బాధపడుతుంటారు.

ఎగ్జామ్స్ రాసే క్రమంలో ముందుగా మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొంత మంది ఎగ్జామ్ హాల్ వద్దకు వెళ్లిన తర్వాత కూడా బుక్ పట్టి చదివేస్తుంటారు. ఇంకొంత మంది ఎక్కువ ఒత్తిడికి లోను అవుతుంటారు. కానీ ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లిన తర్వాత లోతుగా శ్వాస తీసుకొని, చాలా ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా మీకు ఇచ్చిన పరీక్ష పేపర్ ఒకటికి రెండు సార్లు చదివి, వచ్చిన ఆన్సర్స్ టెన్షన్ పడకుండా రాయాలంట. ముఖ్యంగా లాజికల్గా ఆలోచిస్తూ మీ పరీక్షను రాయడం వలన తక్కువ సమయంలో ఎక్కువ క్వశ్చన్స్ రాసే ఛాన్స్ ఉంటుంది.

అదే విధంగా తప్పకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్లో మంచి హెల్దీ ఆహారం తీసుకోవాలి. కొంత మంది ఎగ్జామ్ హడావిడిలో పడి టిఫిన్ చేయడం మానేస్తారు కానీ, ఇది పరీక్షపై ప్రభావం చూపుతుంది. ఆకలితో చదివింది మర్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఆయిల్ ఫుడ్ కాకుండా, శక్తినిచ్చే ఆహారం తీసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్లాలి. ముఖ్యంగా కోడి గుడ్డు, తాజా ఆకుకూరలు, వీలైతే ఒక పండు తిని వెళ్లడం మంచిది.

అలాగే ఎగ్జామ్స్ టైమ్లో మీరు చదువుకునే ముందు రివిజన్ టైమ్ టేబుల్ ఏర్పరుచుకోండి. దీని వలన మీకు ఒక అవగాహన ఉంటుంది. అంతే కాకుండా చదివింది తప్పకుండా బుక్ పై రాయడం అలవాటు చేసుకోవాలి. దీని వలన మీరు చదివింది త్వరగా మర్చిపోకుండా ఉంటారు. అలాగే ముఖ్యమైన తేదీలు పేర్లు టైంటేబుల్ వేసుకొని, వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి.

అలాగే టెన్షన్ వద్దూ. కొంత మంది పరీక్షల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు. అలాగే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేరు. అందువలన వాటి గురించి టెన్షన్ వదిలేసి, టైమ్ టేబుల్ ప్రకారం, సబ్జెక్ట్ను ఎంచుకుంటూ చదువుకోవాలి. అలాగే మీకు పూర్తిగా వచ్చిన సిలబస్ కూడా మరో సారి రివిజన్ చేసుకోవాలి. అంతే కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్ పై రాసుకొని, వాటన్నిటినీ మరోసారి రివిజన్ చేసుకోవడం వలన ప్రతి ఆన్సర్ పర్ ఫెక్ట్గా రాయగలుగుతారు.