ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు కేవలం మొబైల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే వాట్సాప్ వెబ్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
సాధారణంగా వాట్సాప్లో స్టేటస్ షేరింగ్ ఆప్షన్ కేవలం స్మార్ట్ ఫోన్స్లో మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫీచర్ను వాట్సాప్ వెబ్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అంటే ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఇకపై యూజర్లు డెస్క్ టాప్ నుంచి కూడా ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్లను వాట్సాప్ స్టేటస్లుగా షేర్ చేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
అయితే వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్ ద్వారా వెబ్ వెర్షన్ నుంచి లేదా లింక్ చేయబడిన 'కంపానియన్' నుండి స్టేటస్ పెట్టవచ్చు. టెస్టింగ్ స్టేజ్లో భాగంగా ప్రస్తుతం.. ఈ ఫీచర్ బీటా 2.2353.59 వెర్షన్ యూజర్లకు అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం విడుదల చేశారు.
ఇక వెబ్ నుంచి స్టేటస్ అప్డేట్లు చేసినప్పుడు దానిలో కంటెంట్ మొత్తం ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్షన్ లభిస్తుందని వాట్సాప్ చెబుతోంది. ఈ కొత్త ఫీచర్ను ఒదట ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మిగతా యూజర్లకు విడుదల చేయనున్నారు.