
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. వివోవై77టీ పేరుతో కొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను రెండు వేరియంట్స్లో తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,000 కాగా 12 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,000గా ఉంది.

ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ను త్వరలోనే ఇండియాలోకి లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.64 ఇంచెస్ ఫుల్ హెచ్డీ + డిస్ప్లేను అందించారు. 2388 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ ఈ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేసే ఈ స్మార్ట్ఫోన్లో ఆరిజిన్ ఓస్3ని ఇచ్చారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ఫోన్లో డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 44 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే యూఎస్బీ టైప్సి ఛార్జింగ్ పోర్ట్ను అందించారు. బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత.