
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వివో టీ3 లైట్ 5జీ పేరుతో ఈ కొత్త ఫోన్ను లాంచ్ చేయనున్నారు. ఈ నెలఖారులో లేదా జులై మొదటి వారంలో ఈ ఫోన్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫోన్ను తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వివో టీ3 లైట్ 5జీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ను ఇవ్వనున్నారని సమాచారం.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్తో కూడిన ఏఐ రెయిర్ కెమెరాను అందించనున్నారు. సోనీ ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెకండరీ కెమెరా ఉంటాయని సమాచారం. ఇక ఈ ఫోన్ను కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్బ్యాటరీని అందించనున్నారు. ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

అలాగే ఇందులో 6.67 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్ను ఇవ్వనున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తో ఈ స్క్రీన్ రానుందని తెలుస్తోంది. ఇక 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.