ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఓటీపీ రూపంలో నిలువునా దోచుకుంటున్నారు మోసగాళ్లు. ఓటీపీ పొందడానికి కస్టమర్ కేర్ ఏజెంట్లు స్నేహితులుగా నటిస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సిమ్ బ్యాన్, బ్యాంకు ఖాతా మూసివేయడం, విద్యుత్ కనెక్షన్ నిలిపివేయబడతాయనే భయంతో ఏవైసీ పేరుతో ఇంకేవైనా కారణంగా ఓటీపీల రూపంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.
మొబైల్ డబ్బు ఉపసంహరణలో ఓటీపీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓటీపీ పొందడానికి కస్టమర్, ఏజెంట్, కస్టమర్ కేర్గా నటించడం ద్వారా ఆన్లైన్ మోసం జరుగుతుంది. అలాగే కేవైసీ అప్డేట్ పేరుతో కూడా స్కామ్లు జరుగుతున్నాయి. సిమ్ నిషేధం, బ్యాంక్ ఖాతా మూసివేయబడుతుందనే భయం, విద్యుత్ కనెక్షన్ నిలిపివేయబడుతుందనే ఫోన్లు చేస్తూ మోసగిస్తున్నారు.
అయితే, ఆన్లైన్ మోసగాళ్లను వెంటనే పట్టుకోవడంలో సహాయపడే ఫూల్ ప్రూఫ్ ప్లాన్తో ప్రభుత్వం ముందుకు రావడంతో ఇప్పుడు అలాంటి మోసాలకు చెక్ పెట్టనున్నారు. హోం మంత్రిత్వ శాఖ, ఎస్బిఐ, పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, టెలికాం ఆపరేటర్ల బృందం ఒక పటిష్టమైన పథకంపై పని చేస్తోంది. దీని కింద కొత్త ఫార్ములా రూపొందిస్తోంది. ఇక మోసాలకు పాల్పడేందుకు మోసగాళ్లకు సాధ్యం కాకపోవచ్చు.
ఫోన్కు ఓటీపీని పంపినప్పుడు దాని ప్రస్తుత రిజిస్టర్డ్ బ్యాంక్ చిరునామా, దాని ప్రస్తుత లోకేష్ స్థానాన్ని గుర్తిస్తుంది. రెండు చిరునామాలు సరైనవని తేలితే ఓటీపీ నమోదు చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ చెల్లింపు జరుగుతుంది. రెండు లొకేషన్లు సరిగ్గా సరిపోలకపోతే, ఆన్లైన్ మోసం జరిగే ప్రమాదం గురించి వినియోగదారులు హెచ్చరిక అందుకుంటారు. కస్టమర్ నోటీసుపై కూడా ఓటీపీని బ్లాక్ చేయవచ్చు.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (i4C) ప్రకారం, ఏప్రిల్ 2021, డిసెంబర్ 2023 మధ్య సుమారు 10,319 కోట్ల రూపాయల దోపిడీ జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. ఈ రకమైన ఆన్లైన్ మోసం ఎక్కువగా చైనా, కంబోడియా, మయన్మార్ నుండి జరుగుతుంది. 2023 క్యాలెండర్ ఇయర్లో దీనికి సంబంధించి దాదాపు 11 లక్షల ఫిర్యాదులు అందాయి.