
ఈకామర్స్ సైట్లు పండగ సీజన్ను బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్లను అందించాఇయ. దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.

టీవీలు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్మిషన్లు లాంటి గృహోపరకరణాలతో పాటు, దుస్తులు లాంటి ఫ్యాషన్ సంబంధిత కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి.

రెడ్సీర్ అనే కన్సల్టెన్సీ కంపెనీ వివరాల ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్య ఏకంగా 1100 మొబైల్ ఫోన్లు అమ్ముడు పోవడం విశేషం. ఈ ఫోన్ల విలువ అక్షరాల రూ. 11,000 కోట్లు.

ఇక ష్యాషన్ విబాగంలో సాధారణ రోజులతో పోలిస్తే ఫ్యాషన్ విభాగంలో నాలుగున్నర రెట్లు అధికంగా అమ్మకాలు జరిగాయి. వీటి విలువ ఏకంగా రూ. 5,500 కోట్లు కావడం విశేషం.

ఇదిలా ఉంటే కేవలం నాలుగు రోజుల్లో ఈ-కామర్స్ సంస్థలు ఏకంగా రూ. 24,500 కోట్ల వ్యాపారం చేయడం విశేషం.