దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ సామ్సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్24 ఎఫ్ఈ పేరుతో కొత్త ఫోన్ను ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్24 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ ఎక్స్ నోస్ 2400 ఎస్వోసీ లేదా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ ప్రాసెస్తో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్లో 6.1 ఇంచెస్తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు. 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ వేరియంట్ / 256 జీబీ స్టోరేజీ వేరియంట్తో వస్తుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కాగా సామ్సంగ్ గతేడాది తీసుకొచ్చిన గ్యాలకసీ ఎస్23 ఎఫ్ఈకి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్ను తీసుకురానున్నారు. ఈ ఫోన్లో 6.4 ఇంచెష్తో కూడిన స్క్రీన్ను ఇచ్చారు. ఈ ఫోన్ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ గా లాంచ్ చేశారు.