Expensive EV Cars: భారత్‌లో దూసుకుపోతున్న ఈవీ కార్ల సేల్‌.. అత్యంత ఖరీదైన కార్ల గురించి తెలిస్తే షాక్‌

| Edited By: Ram Naramaneni

Nov 17, 2023 | 7:27 PM

భారతదేశంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈవీ కార్ల విషయంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద మార్కెట్‌ అవతరించింది. అయితే బడ్జెట్‌ కార్లతో పోల్చుకుంటే ప్రీమియం కార్లల్లోనే ఎక్కువ ఈవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో మైలేజ్‌ విషయంలో ఈవీ కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపేవారు కాదు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా మైలేజ్‌ విషయం పరిష్కారమైందని భావించే వారి సంఖ్య పెరగడంతో క్రమేపి సేల్స్‌ కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యంత ఖరీదైన ఈవీ కార్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
లగ్జరీ స్పోర్ట్స్‌ కార్ల తయారీ పోర్స్చే టైకాన్‌ పేరుతో ఇటీవల భారతదేశంలో లగ్జరీ ఈవీ కారును పరిచయం చేసింది. ఈ కారు ధర రూ.1.61 కోట్ల నుంచి రూ.2.44 కోట్ల వరకూ ఉంటుంది. పోర్స్చే టైకాన్‌ కారు వివిధ రకాల బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. అలాగే ఈ కారు ఓ సారి చార్జ్‌ చేస్తే 452 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.

లగ్జరీ స్పోర్ట్స్‌ కార్ల తయారీ పోర్స్చే టైకాన్‌ పేరుతో ఇటీవల భారతదేశంలో లగ్జరీ ఈవీ కారును పరిచయం చేసింది. ఈ కారు ధర రూ.1.61 కోట్ల నుంచి రూ.2.44 కోట్ల వరకూ ఉంటుంది. పోర్స్చే టైకాన్‌ కారు వివిధ రకాల బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. అలాగే ఈ కారు ఓ సారి చార్జ్‌ చేస్తే 452 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.

2 / 5
గీలీకి చెందిన బ్రిటిష్‌ కార్ల తయారీ సంస్థ లోటస్‌ ఇటీవల తన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎలిట్రీతో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ కారు ధర ఏకంగా రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్ల వరకూ ఉండడంతో భారతదేశంలో అత్యంత ఖరీదైన ఈవీ కారుగా ఘనత చేజిక్కించుకుంది. ఈ కారు మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ కారు కేవలం 2.95 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దాదాపు 20 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకూ చార్జ్‌ అవుతుంది.

గీలీకి చెందిన బ్రిటిష్‌ కార్ల తయారీ సంస్థ లోటస్‌ ఇటీవల తన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎలిట్రీతో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ కారు ధర ఏకంగా రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్ల వరకూ ఉండడంతో భారతదేశంలో అత్యంత ఖరీదైన ఈవీ కారుగా ఘనత చేజిక్కించుకుంది. ఈ కారు మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ కారు కేవలం 2.95 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దాదాపు 20 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకూ చార్జ్‌ అవుతుంది.

3 / 5
జర్మన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌-బెంజ్‌ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కార్ల సంస్థ. అయితే మెర్సిడెస్‌ బెంజ్‌ ఇటీవల కాలంలో భారత మార్కెట్‌లో విరివిగా కార్లను అందుబాటులో ఉంచుతుంది. బెంజ్‌ రిలీజ్‌ చేసిన ఏఎంజీ ఈక్యూఎస్‌ కారు లగ్జరీ పెర్ఫార్మెన్స్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌గా ఉంది. ముఖ్యంగా ఈ కారు ధర రూ.2.44 కోట్లుగా ఉంది. అలాగే ఈ కారు 3.4 సెకన్లల్లో 0-100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే ఈ కారు ఓ చార్జ్‌పై 580 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.

జర్మన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌-బెంజ్‌ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కార్ల సంస్థ. అయితే మెర్సిడెస్‌ బెంజ్‌ ఇటీవల కాలంలో భారత మార్కెట్‌లో విరివిగా కార్లను అందుబాటులో ఉంచుతుంది. బెంజ్‌ రిలీజ్‌ చేసిన ఏఎంజీ ఈక్యూఎస్‌ కారు లగ్జరీ పెర్ఫార్మెన్స్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌గా ఉంది. ముఖ్యంగా ఈ కారు ధర రూ.2.44 కోట్లుగా ఉంది. అలాగే ఈ కారు 3.4 సెకన్లల్లో 0-100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే ఈ కారు ఓ చార్జ్‌పై 580 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.

4 / 5
ఆడీ కంపెనీ ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్య ఈవీ కార్లను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తుంది. అయితే ఆడీ కంపెనీ రిలీజ్‌ చేసిన ఈవీ కార్లల్లో ఆడీ ఆర్‌ఎస్‌ ఈ ట్రాన్‌ జీటీ అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది. ఈ కారు ధర రూ.1.94 కోట్లు. ఈ కారు ఓ చార్జ్‌పై 481 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.

ఆడీ కంపెనీ ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్య ఈవీ కార్లను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తుంది. అయితే ఆడీ కంపెనీ రిలీజ్‌ చేసిన ఈవీ కార్లల్లో ఆడీ ఆర్‌ఎస్‌ ఈ ట్రాన్‌ జీటీ అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది. ఈ కారు ధర రూ.1.94 కోట్లు. ఈ కారు ఓ చార్జ్‌పై 481 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.

5 / 5
జర్మనీ లగ్జరీ కారు మేకర్‌ బీఎండబ్ల్యూ తన ఫ్లాగ్‌షిప్‌ 7 సిరీస్‌లో భాగంగా బీఎండబ్ల్యూ ఐ7 కారును భారతదేశంలో రిలీజ్‌ చేసింది. ఈ కారు ధర భారత మార్కెట్‌లో రూ.2.03 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకూ ఉంటుంది. ఈ కారు భారతదేశంలో అత్యంత ఖరీదైన రెండో ఎలక్ట్రిక్‌ కారు. ఈ కారు 3.7 సెకన్లలో 0 నుంచి 100 కిలో మీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే ఒక్క చార్జ్‌పై 625 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ముఖ్యంగా ఈ కారు 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకూ చార్జ్‌ అవుతుంది.

జర్మనీ లగ్జరీ కారు మేకర్‌ బీఎండబ్ల్యూ తన ఫ్లాగ్‌షిప్‌ 7 సిరీస్‌లో భాగంగా బీఎండబ్ల్యూ ఐ7 కారును భారతదేశంలో రిలీజ్‌ చేసింది. ఈ కారు ధర భారత మార్కెట్‌లో రూ.2.03 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకూ ఉంటుంది. ఈ కారు భారతదేశంలో అత్యంత ఖరీదైన రెండో ఎలక్ట్రిక్‌ కారు. ఈ కారు 3.7 సెకన్లలో 0 నుంచి 100 కిలో మీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే ఒక్క చార్జ్‌పై 625 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ముఖ్యంగా ఈ కారు 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకూ చార్జ్‌ అవుతుంది.