
లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ పోర్స్చే టైకాన్ పేరుతో ఇటీవల భారతదేశంలో లగ్జరీ ఈవీ కారును పరిచయం చేసింది. ఈ కారు ధర రూ.1.61 కోట్ల నుంచి రూ.2.44 కోట్ల వరకూ ఉంటుంది. పోర్స్చే టైకాన్ కారు వివిధ రకాల బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. అలాగే ఈ కారు ఓ సారి చార్జ్ చేస్తే 452 కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుంది.

గీలీకి చెందిన బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ లోటస్ ఇటీవల తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎలిట్రీతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కారు ధర ఏకంగా రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్ల వరకూ ఉండడంతో భారతదేశంలో అత్యంత ఖరీదైన ఈవీ కారుగా ఘనత చేజిక్కించుకుంది. ఈ కారు మూడు వేరియంట్స్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ కారు కేవలం 2.95 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దాదాపు 20 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకూ చార్జ్ అవుతుంది.

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కార్ల సంస్థ. అయితే మెర్సిడెస్ బెంజ్ ఇటీవల కాలంలో భారత మార్కెట్లో విరివిగా కార్లను అందుబాటులో ఉంచుతుంది. బెంజ్ రిలీజ్ చేసిన ఏఎంజీ ఈక్యూఎస్ కారు లగ్జరీ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ సెడాన్గా ఉంది. ముఖ్యంగా ఈ కారు ధర రూ.2.44 కోట్లుగా ఉంది. అలాగే ఈ కారు 3.4 సెకన్లల్లో 0-100 కిలోమీటర్ల స్పీడ్ను అందుకుంటుంది. అలాగే ఈ కారు ఓ చార్జ్పై 580 కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుంది.

ఆడీ కంపెనీ ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్య ఈవీ కార్లను భారత మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. అయితే ఆడీ కంపెనీ రిలీజ్ చేసిన ఈవీ కార్లల్లో ఆడీ ఆర్ఎస్ ఈ ట్రాన్ జీటీ అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది. ఈ కారు ధర రూ.1.94 కోట్లు. ఈ కారు ఓ చార్జ్పై 481 కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుంది.

జర్మనీ లగ్జరీ కారు మేకర్ బీఎండబ్ల్యూ తన ఫ్లాగ్షిప్ 7 సిరీస్లో భాగంగా బీఎండబ్ల్యూ ఐ7 కారును భారతదేశంలో రిలీజ్ చేసింది. ఈ కారు ధర భారత మార్కెట్లో రూ.2.03 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకూ ఉంటుంది. ఈ కారు భారతదేశంలో అత్యంత ఖరీదైన రెండో ఎలక్ట్రిక్ కారు. ఈ కారు 3.7 సెకన్లలో 0 నుంచి 100 కిలో మీటర్ల స్పీడ్ను అందుకుంటుంది. అలాగే ఒక్క చార్జ్పై 625 కిలో మీటర్ల మైలేజ్ను ఇస్తుంది. ముఖ్యంగా ఈ కారు 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకూ చార్జ్ అవుతుంది.