
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మీ తాజాగా కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. రెడ్మీ 12 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ను వచ్చే నెలలో మార్కేట్లోకి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టగా భారత్లో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్ ఫుల్హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. 1,080X2,460 పిక్సెల్ రిజల్యూషన్ ఈ ఫోన్ స్క్రీన్ సొంతం.

ఇక మీడియా టెక్ హీలియో జీ88 ఎస్ఎఓసీ ప్రాసెసర్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 17,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ధఱకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ను అందిస్తున్నారు. 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

ఇక బ్యాటరీకి ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.