
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ భారత మార్కెట్లోకి సీ 53 స్మార్ట్ ఫోన్ను తీసుకొస్తోంది. జులై 19న మధ్యాహ్నం ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోన్ రానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ మలేషియాలో విడుదలైంది.

ఈ స్మార్ట్ ఫోన్లో 90 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో కూడిన 6.74 ఇంచెస్ డిస్ప్లేను అందించారు. ఆక్టాకోర్ ఎస్ఓసీ ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ను ఇచ్చారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

రియల్మీ సీ53 స్మార్ట్ ఫోన్లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇతర దేశాల్లో లాంచ్ అయిన ధరల ఆధారంగా ఈ ఫోన్ ధర రూ. 13వేల లోపు ఉండొచ్చని అంచనా వేశారు.