చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్6 నియో పేరుతో ఈ ఫోన్ను తీసుకొస్తున్నారు. మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ను ఇండియాలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ను బ్లూ కలర్ ఆప్షన్లో అందించనున్నారు. రెక్ట్యాంగులర్ రేర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్తో రెండు కెమెరా సెన్సర్లను ఇవ్వనున్నారు.
ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ల 108 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
8 జీబీ ర్యామ్తో తీసుకొస్తున్న ఈ ఫోన్లో రెండు స్టోరేజ్ వేరియంట్స్ను ఇవ్వనున్నారు. ఫోన్ ధర రూ. 18 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో ఓఎల్ఈడీ డిస్ప్లేను ఇవ్వనున్నారు.
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 33 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్తో పనిచేస్తుంది.