చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. పోకో ఎమ్6 ప్రో 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్లో మంచి ఫీచర్లను అందించారు. ఈ ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోకో ఎమ్6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,700కాగా.. 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర సుమారు రూ. 14,400గా ఉండనుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్తో కూడిన ఫుల్హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందించారు. డీసీ డిమ్మింగ్ ఫీచర్ను ప్రత్యేకంగా అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ91 ప్రాసెసర్తో పనిచేస్తుంది.
ఇక ఈ ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ని ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5030 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 108 మెగాపిక్సెల్స్తో కూడి రెయిర్ కెమెరాను, 2 మెగాపిక్సెల్స్ సెకడంరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్తో కూడని ఫ్రంట్ కెమెరాను అందించారు.