
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కెంపెనీ ఒప్పో తాజాగా మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు ఈ ఫోన్ సొంతం .

ఒప్పో ఎఫ్19ఎస్ పేరుతో తీసుకొచ్చి ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 19,990గా నిర్ణయించారు. ఫ్లిప్కార్టులో అందుబాటులో ఉన్న ఈ ఫోన్పై యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి.

ఈ ఫోన్లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లేను అందించారు. అంతేకాకుండా ట్రిపుల్ కెమెరాను అందించారు.

కెమెరా విషయానికొస్తే 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.