
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. నోకియా సీ 21 ప్లస్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ.10,299 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,299గా ఉంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్తో 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. యూనిసోక్ SC9863A చిప్సెట్తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 10 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్+2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ డ్యూయల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియోల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 11గో ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,050ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

మూడు రోజుల పాటు బ్యాటరీ నాన్ స్టాప్గా పనిచేస్తుంది. 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, బ్లూటూత్ 4.2, ఫింగర్ప్రింట్ సెన్సార్, యూఎస్బీ 2.0 లాంటి ఫీచర్స్ ఉన్నాయి.