
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటొరోలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. మొన్నటి వరకు బడ్జెట్ ఫోన్స్ను తీసుకొచ్చిన మోటొరోలా తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. మోటొరోలా ఎడ్జ్ 40 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లో బెస్ట్ ఫీచర్స్ని అందించాయి.

ఈ స్మార్ట్ ఫోన్లో 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+తో కూడిన 3డీ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లేను అందించారు. ఈ నెల చివరిలో ఈ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ఎస్ఓసీ చిప్తో పనిచేస్తే ఈ స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అందించారు.

బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ స్మార్ట్ ఫోన్లో 68 వాట్స్ టర్బో పవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 50,000గా ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.