ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్న మొటోరోలో తాజాగా మోటో జీ51 పేరుతో మరో కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. బుధవారం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలోనే భారత్లోకి రానుంది.
8జీబీ+128 జీబీ స్టోరేజ్తో కూడిన ఈ ఫోన్ ధర భారత్లో రూ. 17,500కు లభించనున్నట్లు చైనీస్ బ్లాగర్ ఒక తెలిపింది.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..ఇందులో 6.8 అంగులా హోల్ పంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో కూడిన 120 హెచ్జెడ్ స్క్రీన్ను అందించారు.
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480+ ఎస్ఓసీ ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్లో 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరాను అందించారు. వీటిలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిల్క్సె, 2 మెగా పిక్సెల్ కెమెరాలను అందిచారు.