
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ ఎమ్ 19 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ట్యాబ్లెట్కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు.

ఈ లెనోవో ట్యాబ్లెట్లో 10.61 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. 1200 x 2000 రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ట్యాబ్ పని చేస్తుంది.

ఈ ట్యాబ్లెట్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ఎస్ఓసీ ప్రాసెస్తో పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో డాల్బీ ఆట్మోస్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమారతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 12 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్ టైం ఈ ట్యాబ్ సొంతం.

ఈ ట్యాబ్లెట్ బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 24,999 కాగా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర ఇంకా ప్రకటించలేదు. ఈ ట్యాబ్లెట్ నేటి నుంచి (జులై 15) అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.