చైనాకు చెందిన టెక్ దిగ్గజం లెనోవో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ పీ12 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లో అదిరిపోయే ఫీచర్లను అందించారచు.
ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 60 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో కూడిన 12.7 ఇంచెస్ ఎల్టీపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ను అందించారు. 2,944x1,840 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకత.
ఇక ఈ ట్యాబ్ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,168గా ఉంది. ఆగస్టులో ఈ ట్యాబ్లెట్ ఆన్లైన్లో సేల్ ప్రారంభం కానుంది.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ట్యాబ్లెట్లో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ప్రాసెసర్ను అందించారు. ఇది స్టార్మ్ గ్రే, ఓట్ కలర్ షేడ్స్లో అందుబాటులోకి రానున్నాయి.
ఇక లెనెవో ట్యాబ్ పీ12లో 10,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 10 గంటల వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ, USB టైప్-C 2.0, WiFi 6 సపోర్ట్ ఈ ట్యాబ్లెట్ సొంతం.