చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో తాజాగా భారత మార్కెట్లోకి లెనోవో ట్యాబ్ కే 10 పేరుతో సరికొత్త ట్యాబ్ను తీసుకొచ్చింది. లెనోవో అధికారిక వెబ్సైట్తో పాటు పలు ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఈ ట్యాబ్ అందుబాటులో ఉంది.
ఇక ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే.. 10.3 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీడీడీఐ డిస్ప్లేను అందించారు. ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో P22T SOC ప్రాసెసర్తో పనిచేస్తే ఈ ట్యాబ్లో 10W ఛార్జింగ్ సపోర్ట్ చేసే 7,500mAh బ్యాటరీని అందించారు.
ఇందులోని డ్యుయల్ స్పీకర్లు డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేయడం ఈ ట్యాబ్ ప్రత్యేకత. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తుంది.
128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఈ ట్యాబ్లో మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్ను 1TB వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్తో కూడిన 8 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
3 జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ. 13,999కి, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 15,999, వైఫై + 4 జీ ఎల్టీఈ మోడల్ రూ. 16,999కి అందుబాటులో ఉన్నాయి.