
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో కొత్త ట్యాబ్ను లాంచ్ చేసిది. లెనోవో ట్యాబ్ పీ12 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్ ఇప్పటికే ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్న ట్యాబ్ కంపెనీ అధికారిక వెబ్సైట్తో పాటు ఫ్లిప్కార్ట్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 12.7 ఇంచెస్ ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించనున్నారు.

3కే రిజల్యూషన్ ఈ డిస్ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక లెనోవో ట్యాబ్ పీ12 మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ప్రాసెసర్తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ట్యాబ్ రన్ అవుతుంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్లో 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ట్యాబ్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 36,000 వరకు ఉండొచ్చని అంచనా.

లెనోవో ట్యాబ్లో 10,200 ఎమ్ఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. దీంతో ఏకంగా 10 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైం లభిస్తుంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది.