
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ లెనొవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. బడ్జెట్ మార్కెట్ను టార్గెట్ చేసుకొని ఈ ట్యాబ్ను తీసుకొచ్చింది. లెనొవో ఎమ్11 పేరతుతో ఈ ట్యాబ్ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ట్యాబ్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

లెనొవో ఎమ్11 పేరుతో రెండు వేరియంట్స్లో ట్యాబ్స్ను లాంచ్ చేసింది. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరనుర ఊ. 14,900గా నిర్ణయిచారు. అయితే మరో వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

ఇక ఈ ట్యాబ్ను ఏప్రిల్ నెల నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు లెనొవో ప్రకటించింది. ఈ ట్యాబ్లో రెండు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లతో పాటు నాలుగేళ్ల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ఇక ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ట్యాబ్లో 7,040 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో.. 13 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీలు.. వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

ఈ ట్యాబ్లో ప్రత్యేకంగా మల్టీ టాస్కింగ్ ఫీచర్ను అందించనున్నారు. దీంతో ఒక పని చేస్తున్న సమయంలోనే ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా వీడియో చూస్తున్న సమయంలో నోట్స్ రాసుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్కు పెన్ సపోర్ట్ను కూడా ఇవ్వనున్నారు. అయితే దీనిని ప్రత్యేంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.