స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరిగా మారిన నేపథ్యంలో చాలా కంపెనీలు కొగొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర కేవలం రూ. 5,299కే అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11తో పనిచేస్తుంది. 100 డేస్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ఆఫర్ను లావా ప్రత్యేకంగా ఇస్తోంది.
కెమెరా విషయానికొస్తో ఈ ఫోన్లో 5 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్లో 5 ఇంచెస్ డిస్ప్లేను ఇచ్చారు.
ఆక్టా కోర్ ప్రాసెసర్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్, Wi-Fi, USB కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇచ్చారు. ఇక ఈ ఫోన్కు ఏడాది హ్యాండ్ సెట్ వారంటీ, ఇతర యాక్ససరీస్కు 6 నెలలు వారంటీ అందించారు.