
5జీ స్మార్ట్ ఫోన్ అంటే కనీసం రూ. 25వేలకిపైగా బడ్జెట్ పెట్టాల్సిందే. అయితే ప్రస్తుతం టెక్నాలజీలో వచ్చిన మార్పులు, కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఫోన్ల ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా రూ. 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకే 5జీ ఫోన్ను తీసుకొచ్చే పనిలో పడింది. దసరా కానుకగా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఐటెల్ పీ55 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ నెలాఖరు నాటికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10వేల కంటే తక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్తో కూడిన ఎపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్ ఆక్టాకోర్, 1.6 జీహెచ్జెడ్ ప్రాసెసర్తో పని చేస్తుందని తెలుస్తోంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెలత్స్ కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది.