
మటన్ వెల్లుల్లి కారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని వెల్లుల్లి, కారం, మసాలాలతో చేస్తారు. ఈ కూరను ఎక్కువగా చపాతీల్లోకి తింటారు. మరి, ఇంకెందుకు లేట్ మీరు ఇక్కడ దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ముందుగా మటన్ ను బాగా ఉడికించాలి: ముందుగా మటన్ తీసుకుని దానిని ఉడకబెట్టి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి బాగా ఉడికించుకోవాలి. ఇలా ముక్కలకు పట్టిస్తే కూర మంచి టేస్ట్ వస్తుంది.

ఇప్పుడు వెల్లుల్లి కారంను ప్రిపేర్ చేసుకోవాలి: ముందుగా వెల్లుల్లిని తీసుకుని రెబ్బలుగా విడతీసి ఆ తర్వాత వాటి పొట్టు తీసి మిక్సీ గిన్నెలో వేసి ఈ వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి, ధనియాల , ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి వాటిని పొడి లాగా చేసుకోవాలి.

ఇలా పోపు పెట్టుకోవాలి : ఇప్పుడు పాన్ తీసుకుని దీనిలో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక అర టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఇంకా కరివేపాకు ఆకులు కూడా వేసి వీటిని బాగా వేయించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ పాన్లో వేసి స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి.

చివర్లో మటన్ కు వెల్లుల్లి కారం ఇలా పట్టించుకోవాలి : ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం, మటన్ కు పట్టేలా కనీసం 15 నిముషాల పాటు మీడియం మంట మీద ఉంచాలి. చివర్లో కొత్తిమీర వేసుకుని తినడమే. ఇంకా దీనిని వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే సూపర్ గా ఉంటుంది. ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు.