
కావాల్సిన పదార్ధాలు : పెద్ద ఉల్లిపాయలు , 5 కప్పుల పెరుగు, 7 పచ్చిమిరపకాయలు , ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, అర కప్పు నూనె, పావు టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు తీసుకోవాలి.

ముందుగా కట్ చేసిన ఉల్లియలు, పచ్చి మిర్చిని తీసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకుని పెరుగు వేసి దానిని కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు మిశ్రమాన్ని తీసుకుని దానిలో అర టీ స్పూన్ పసుపు వేసి స్పూన్ తో బాగా కలిపి ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ లేక కట్టెల పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, రెండు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకు ఆకుల వేసి ఆ తాలింపులో ఈ పెరుగు మిశ్రమాన్ని వేసి రెండు లేక మూడు గ్లాస్ లు నీళ్ళు పోసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

చివర్లో పెరుగు మిశ్రమం తాలింపులో కలిసిపోయాక కొత్తిమీర వేసి గరిటేతో బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది సద్దన్నంతో తింటే టేస్టీగా ఉంటుంది.